అనగా అనగా ,
ఒక వూరిలో ఒక రాజుగారు వున్నారు. ఆ రాజు గారికి ఏడుగురు కొడుకులు వున్నారు.
ఏడుగురు కొడుకులూ ఒక రోజు చెరువుకి వెళ్లి ఏడు చేపలు పట్టి తెచ్చి ఎండలో పెట్టారు.
సాయంత్రం చూసేసరికి ఆ ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.
"చేపా చేపా ఎందుకు ఎండలేదు ?" అని అడిగారు ఆ రాజుగారి కొడుకులు.
"నాకు గడ్డి వాము అడ్డు వచ్చింది" అని అంది ఆ చేప.
అప్పుడు రాజుగారి కొడుకులు గడ్డి వాము దగ్గరకి వెళ్లి "గడ్డి వాము గడ్డి వాము, ఎందుకు అడ్డు వచ్చావు?" అని అడిగారు.
అప్పుడు గడ్డి వాము "నన్ను ఆవు మేయ లేదు" అని అంది.
అప్పుడు రాజుగారి కొడుకులు ఆవు దగ్గరకి వెళ్లి "ఆవూ ఆవూ, నువ్వు గడ్డివాముని ఎందుకు మేయ్యలేదు?" అని అడిగారు.
అప్పడు ఆవు "పెయ్య పాలు తాగలేదు" అని అంది.
అప్పుడు రాజుగారి కొడుకులు పెయ్య దగ్గరకి వెళ్లి "పెయ్యా పెయ్యా, నువ్వు పాలు ఎందుకు తాగలేదు?" అని అడిగారు.
అప్పడు పెయ్య "పాలెగాడు నన్ను వదలలేదు" అని అంది .
అప్పుడు రాజుగారి కొడుకులు పాలెగాడు దగ్గరకి వెళ్లి "పాలెగాడా పాలెగాడా, నువ్వు పెయ్యని ఎందుకు వదలలేదు?" అని అడిగారు.
అప్పుడు పాలెగాడు "పాప ఏడ్చింది" అని అన్నాడు
అప్పుడు రాజుగారి కొడుకులు పాప దగ్గరకి వెళ్లి "పాపా పాపా, నువ్వు ఎందుకు ఎడ్చావు?" అని అడిగారు.
అప్పుడు పాప "నన్ను చీమ కుట్టింది" అని చెప్పింది.
అప్పుడు రాజుగారి కొడుకులు పాప దగ్గరకి వెళ్లి "చీమా చీమా, నువ్వు పాపని ఎందుకు కుట్టావు?" అని అడిగారు.
అప్పుడు చీమ ఏమనింది అంటే ... ఏమనింది అంటే ... "నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా?"
అప్పుడు రాజుగారి పిల్లలకి ఒక సమస్య వెనక ఎన్నో సమస్యలు, కారణాలు వుంటాయి అని అర్ధమయ్యింది.
గమనిక: ఈ కధ లో పిల్లల మది లో ప్రశ్నలు ఎలా వస్తాయో, వాళ్ళకి కారణాలు తెలుసుకోవాలి అన్న అభిలాష ఎలా వుంటుందో పెద్దవాళ్ళకి అర్ధమవుతుంది.
ఒక వూరిలో ఒక రాజుగారు వున్నారు. ఆ రాజు గారికి ఏడుగురు కొడుకులు వున్నారు.
ఏడుగురు కొడుకులూ ఒక రోజు చెరువుకి వెళ్లి ఏడు చేపలు పట్టి తెచ్చి ఎండలో పెట్టారు.
సాయంత్రం చూసేసరికి ఆ ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.
"చేపా చేపా ఎందుకు ఎండలేదు ?" అని అడిగారు ఆ రాజుగారి కొడుకులు.
"నాకు గడ్డి వాము అడ్డు వచ్చింది" అని అంది ఆ చేప.
అప్పుడు రాజుగారి కొడుకులు గడ్డి వాము దగ్గరకి వెళ్లి "గడ్డి వాము గడ్డి వాము, ఎందుకు అడ్డు వచ్చావు?" అని అడిగారు.
అప్పుడు గడ్డి వాము "నన్ను ఆవు మేయ లేదు" అని అంది.
అప్పుడు రాజుగారి కొడుకులు ఆవు దగ్గరకి వెళ్లి "ఆవూ ఆవూ, నువ్వు గడ్డివాముని ఎందుకు మేయ్యలేదు?" అని అడిగారు.
అప్పడు ఆవు "పెయ్య పాలు తాగలేదు" అని అంది.
అప్పుడు రాజుగారి కొడుకులు పెయ్య దగ్గరకి వెళ్లి "పెయ్యా పెయ్యా, నువ్వు పాలు ఎందుకు తాగలేదు?" అని అడిగారు.
అప్పడు పెయ్య "పాలెగాడు నన్ను వదలలేదు" అని అంది .
అప్పుడు రాజుగారి కొడుకులు పాలెగాడు దగ్గరకి వెళ్లి "పాలెగాడా పాలెగాడా, నువ్వు పెయ్యని ఎందుకు వదలలేదు?" అని అడిగారు.
అప్పుడు పాలెగాడు "పాప ఏడ్చింది" అని అన్నాడు
అప్పుడు రాజుగారి కొడుకులు పాప దగ్గరకి వెళ్లి "పాపా పాపా, నువ్వు ఎందుకు ఎడ్చావు?" అని అడిగారు.
అప్పుడు పాప "నన్ను చీమ కుట్టింది" అని చెప్పింది.
అప్పుడు రాజుగారి కొడుకులు పాప దగ్గరకి వెళ్లి "చీమా చీమా, నువ్వు పాపని ఎందుకు కుట్టావు?" అని అడిగారు.
అప్పుడు చీమ ఏమనింది అంటే ... ఏమనింది అంటే ... "నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా?"
అప్పుడు రాజుగారి పిల్లలకి ఒక సమస్య వెనక ఎన్నో సమస్యలు, కారణాలు వుంటాయి అని అర్ధమయ్యింది.
గమనిక: ఈ కధ లో పిల్లల మది లో ప్రశ్నలు ఎలా వస్తాయో, వాళ్ళకి కారణాలు తెలుసుకోవాలి అన్న అభిలాష ఎలా వుంటుందో పెద్దవాళ్ళకి అర్ధమవుతుంది.